కొత్త సెక్రటేరియట్ ను పరిశీలించిన కేసీఆర్

కొత్త సెక్రటేరియట్ ను పరిశీలించిన  కేసీఆర్

కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గంటన్నర పాటు పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంబడి ఆర్ అండ్ బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి, అధికారులు ఉన్నారు. సెక్రటేరియట్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు సీఎం. ఇటీవలే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ భవనానికి వాడిన స్టోన్ ను పరిశీలించి వచ్చారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొత్త సెక్రటేయట్ కోసం 610కోట్లు కేటాయించింది ప్రభుత్వం. దీంతో పనులను మరింత  స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సెక్రటేరియట్ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచించారు సీఎం కేసీఆర్.