వీఆర్ఏలకు  ప్రమోషన్లు ఇస్తానని కేసీఆర్ మోసం

 వీఆర్ఏలకు  ప్రమోషన్లు ఇస్తానని కేసీఆర్ మోసం

మేడ్చల్ జిల్లా:  సీఎం  కేసీఆర్ సొంత నిర్ణయాలతో ప్రభుత్వ వ్యవస్థలను అస్తవ్యస్తంగా మారుస్తున్నారని తెలిపారు బీజేపీ లీడర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గురువారం  మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్  మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల.. వ్యవసాయ భూములు కలిగిన తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేద ప్రజల భూములను పెద్దలకు కట్టబెడుతున్నారన్నారు. వీఆర్ఏలకు  ప్రమోషన్ లు ఇచ్చి వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తానని కేసీఆర్ మాట తప్పారని చెప్పారు. వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు దీక్షలో కూర్చుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.