జూన్ 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్

జూన్ 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్

కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. జూన్ 5న హాజరు కావాలని కమిషన్ నోటీసులు పంపిన విషయం తెలసిందే. అయితే విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కమిషన్ ను కోరారు కేసీఆర్. జూన్ 11న హాజరవుతానని, అంత వరకు సమయం ఇవ్వాలని కోరారు.

మరోవైపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు జూన్ 9న హాజరుకానున్నారు. ఆయన ఇరేగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో నోటీసులు జారీ చేసింది కమిషన్. అయితే ఈ నోటీసులపై వివరణ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 

హరీష్ రావు 9న హాజరైన తర్వాత 11న హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. హరీష్ ను ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారో తెలుసుకుని అధ్యయనం చేసి వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే కమిషన్ ముందు హాజరు కావలని నిర్ణయించుకున్న కేసీర్.. ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తైనంత వరకు అన్ని వివరాలపై అధ్యయనం చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో కేసీఆర్ ను కేటీఆర్, హరీష్ రావు ఇటీవలే వరుసగా కలిసి చర్చించారు. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో సుదీర్ఘ మంతనాలు జరిపారు కేసీఆర్. ప్రాజెక్టు వివరాలు, కమిషన్ అడిగే ప్రశ్నలు మొదలైన కీలక అంశాలపై ఈ మధ్యే చర్చించారు. 

హరీష్ రావు కమిషన్ ముందు హాజరయ్యాక మరోసారి కేసీఆర్ ఆయనను కలవనున్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ జరుగుతున్న విధానాన్ని ఇద్దరు చర్చించనున్నారు. ఆ తర్వాత 11వ తేదీని కమిషన్ ముందుకు వెళ్లాని భావిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్.