నేడు ఢిల్లీకి కేసీఆర్..మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం ?

నేడు ఢిల్లీకి కేసీఆర్..మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం ?

సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడ్రోజులు ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కేంద్రం కేటాయించిన వసంత విహార్  ల్యాండ్ ను పరిశీలించనున్నట్లు సమాచారం. ప్రధాని, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ అడిగినా ఖరారు కాలేదని సమాచారం. పలువురు రైతు సంఘాల నేతలతోనూ సీఎం భేటీ అవుతారని టీఆర్ ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.