ఇవాళ( డిసెంబర్ 15న) ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

ఇవాళ( డిసెంబర్ 15న) ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
  • ఫిజియోథెరపీ కోసం నందినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇంట్లో ఉండనున్న మాజీ సీఎం
  • యశోద ఆసుపత్రిలో పరామర్శించిన పలువురు ప్రముఖులు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. మెడికల్ ఫాలో అప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా నందినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇంట్లోనే ఆయన ఉండనున్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల టైమ్ పడుతుందని డాక్టర్లు తెలిపారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈనెల 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్​మెంట్ సర్జరీ చేసింది. ఆయన కోలుకుంటుండటంతో శుక్రవారం డిశ్చార్జి చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. మరోవైపు గురువారం యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పలువురు ప్రముఖులు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరామర్శించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రముఖ నటుడు నరేశ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ పి.విష్ణువర్ధన్​రెడ్డి ఆధ్వర్యంలో పూజారులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు.

ఎమ్మెల్సీ కవితతో నటుడు సందీప్, దర్శకుడు జీవన్​రెడ్డి భేటీ

సినీ నటుడు సందీప్, దర్శకుడు జీవన్​రెడ్డి గురువారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆమె నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజాజీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. వారి వెంట భారత జాగృతి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీధర్​రావు ఉన్నారు.