కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టాలె : రవీందర్ నాయక్

కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టాలె : రవీందర్ నాయక్

కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు రవీందర్ నాయక్  డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ అవినీతిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం ఏర్పడ్డ తెలంగాణను కుటుంబపాలనతో దోచుకుంటున్నారని ఆరోపించారు.

కేసీఆర్ అవినీతి బాగోతాలు బయటపడకుండా ఉండేందుకే బీఆర్ఎస్ పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టారని రవీందర్ నాయక్ ఆరోపించారు. గిరిజనులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలన్నారు. గిరిజన, దళిత బంధులు ప్రకటనలకే పరిమితమయ్యాయని అన్నారు.గిరిజనులకు సంబంధించిన పథకాలు అమలు చేయకపోవడంపై గిరిజన శాఖ మంత్రి సత్యవతి కేసీఆర్ ను నిలదీయాలని డిమాండ్ చేశారు