కేసీఆర్ కు మానసిన పరిస్థితి అదుపు తప్పింది

కేసీఆర్ కు మానసిన పరిస్థితి అదుపు తప్పింది
  • కేసీఆర్ కు మానసిన పరిస్థితి అదుపు తప్పింది
  • దుబ్బాక, హుజూరాబాద్ దెబ్బతో కేసీఆర్ కు మతి తప్పింది

హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర బీజేపీ పోరాడుతుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా రూల్స్ పాటించాలని పోలీసులు నాకు చెప్పారని.. రూల్స్ పాటిస్తూనే గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తానని పోలీసులకు చెప్పానన్నారు. ఎయిర్ పోర్ట్ లోనే ప్రభుత్వ తీరు బయటపడిందని తెలిపారు. అధికారులు అడ్డుకోవడంపైనే దృష్టిపెట్టారన్న నడ్డా.. తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తుందని.. ప్రజాస్వామ్య  విరద్ధంగా పాలన నడుస్తోందన్నారు.  క్రమశిక్షణ కలిగిన పార్టీ నేతలుగా మేం రూల్స్ పాటించామన్న ఆయన.. కరోనా పేరుతో సర్కార్ వాడుకుంటుందన్నారు. దుబ్బాక, హుజురాబాద్ దెబ్బతో కేసీఆర్ కు మతి తప్పిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా.

https://youtu.be/M4oecmHkcso