
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలిపారు. గురువారం గుజరాత్లోని గాంధీనగర్లో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది చివర్లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమన్నారు. ఇండియా కూటమితో తాము కలిసి పోటీ చేసేది లోక్ సభ ఎన్నికల వరకేనన్నారు.
కాగా, కేజ్రీవాల్ కామెంట్లపై బీజేపీ నేత అజయ్ అలోక్ విమర్శలు గుప్పించారు. బిహార్లో కేజ్రీవాల్ పోటీ చేస్తే అభ్యంతరం లేదని, ప్రజలే ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తారని అన్నారు. ఢిల్లీ మాదిరిగా ఇక్కడి ప్రజలూ ఆ పార్టీకి బుద్ధి చెప్తారన్నారు.