కాళేశ్వరం పుష్కర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంత వచ్చిందంటే..

కాళేశ్వరం పుష్కర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంత వచ్చిందంటే..

దక్షిణ కాశీ గా పేరుగాంచిన  ప్రసిద్ధ పుణ్యకేత్రమైన కాళేశ్వరం పుష్కరాలు ఘనంగా ముగిశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు దర్శించుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాలు ముగిసిన సందర్భంగా సర్వస్తి ఆలయంలోని పుష్కర  హుండీ లెక్కించారు ఆలయ సిబ్బంది. 

కాళేశ్వరం ఆలయానికి సరస్వతి పుష్కరాలు 12 రోజులు సహా  మొత్తం 64 రోజులకు గాను 1,36,28,099/- రూపాయల ఆదాయం వచ్చినట్లు హుండీల పర్యవేక్షణాధికారి నందనం కవిత తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్  మహేష్, సహాయ కమీషనర్  ఆర్ సునిత పాల్గొన్నారు.

►ALSO READ | ప్రజా ప్రభుత్వంలో దళితులకు ప్రాధాన్యం: సీఎం రేవంత్

పుష్కరాలకు వివిధ ఏర్పాట్ల ద్వారా మొత్తం కోటి 36 లక్షల రూపాయలు వచ్చినట్లు తెలిపారు. గదుల ద్వారా లక్షా 71 వేలు,  హోమాల ద్వారా లక్షా 23 వేలు, శీఘ్రదర్శనం ద్వారా 5 లక్షల 60 వేలు,  ప్రసాదాల ద్వారా 1,38,36,552, హుండీల ఆదాయం 1,36,28,099 కలిపి  మొత్తం 2,83,18,651, అనగా2 కోట్ల 83 లక్షల, 18 వేల 651 రూపాయలు వచ్చినట్లు లెక్కింపు తర్వాత తెలిపారు.

డబ్బుతో పాటు భక్తులు ప్రసాదించి మిశ్రమ బంగారం 15 గ్రాములు, మిశ్రమ వెండి 1-750 గ్రాములు వచ్చినట్లు పర్యవేక్షణాధికారి నందనం కవిత వెల్లడించారు.