ఆమ్రపాలికి కీలక బాధ్యతలు

ఆమ్రపాలికి కీలక బాధ్యతలు

హైదరాబాద్,వెలుగు:  హెచ్ఎండీఏ జాయింట్​ కమిషనర్​ఆమ్రపాలికి పలు కీలక బాధ్యతలు అప్పగించారు.  ఈ మేరకు గురువారం హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలిని హెచ్​ఎండీఏ జాయింట్​ కమిషనర్​గా నియమించిన సమయంలోనే మూసీ రివర్​డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఎండీ బాధ్యతలను ప్రభుత్వం ఆమెకు అప్పగించింది.ఆమె విధుల్లో చేరిన వెంటనే  మూసీ బ్యూటిఫికేషన్​ప్రాజెక్టులో భాగంగా గుజరాత్​, ఢిల్లీ పర్యటించి సబర్మతి నది, నర్మదా ప్రాజెక్టుల పనితీరును పరిశీలించి వచ్చారు. తాజాగా కమిషనర్​ దానకిశోర్​ మరికొన్ని బాధ్యతలను ఆమ్రపాలికి కేటాయించారు. ఇకపై హెచ్ఎండీఏ పరిధిలో ల్యాండ్ ​పూలింగ్​స్కీమ్​, లేక్​ ప్రొటెక్షన్ ​కమిటీ, వాటికి సంబంధించిన వ్యవహారాలు, ఎస్టేట్​ విభాగం వ్యవహారాలు, అర్బన్​ఫారెస్ట్రీ వింగ్ ​వ్యవహారాల బాధ్యతలను కూడా  ఆమె నిర్వహించనున్నారు.