
హైదరాబాద్,వెలుగు: హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ఆమ్రపాలికి పలు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా నియమించిన సమయంలోనే మూసీ రివర్డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాధ్యతలను ప్రభుత్వం ఆమెకు అప్పగించింది.ఆమె విధుల్లో చేరిన వెంటనే మూసీ బ్యూటిఫికేషన్ప్రాజెక్టులో భాగంగా గుజరాత్, ఢిల్లీ పర్యటించి సబర్మతి నది, నర్మదా ప్రాజెక్టుల పనితీరును పరిశీలించి వచ్చారు. తాజాగా కమిషనర్ దానకిశోర్ మరికొన్ని బాధ్యతలను ఆమ్రపాలికి కేటాయించారు. ఇకపై హెచ్ఎండీఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్స్కీమ్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ, వాటికి సంబంధించిన వ్యవహారాలు, ఎస్టేట్ విభాగం వ్యవహారాలు, అర్బన్ఫారెస్ట్రీ వింగ్ వ్యవహారాల బాధ్యతలను కూడా ఆమె నిర్వహించనున్నారు.