నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జనం పూర్తైంది. నాలుగు గంటల పాటు జరిగిన శోభాయాత్ర అనంతరం ఖైరతాబాద్ మహా గణపతిని ఉత్సవ కమిటీ నిమజ్జనం చేశారు. దాదాపు 70 అడుగుల భారీ క్రేన్ సాయంతో.. భక్తుల నినాదాల మధ్య.. బడా గణేశ్ ను గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి సారిగా భక్తులు లంబోదరుడిని దర్శించుకున్నారు. భారీ విగ్రహాన్ని పెద్ద క్రేన్ తో నెమ్మడిగా ఎత్తి.. హుస్సేన్ సాగర్ లో వదిలారు.
ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర.. మధ్యాహ్నం 12:00 గంటల వరకు కొనసాగింది. అనంతరం మహాగణపతికి హారతి ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల లోపే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేశారు. లక్షల మంది భక్తులు.. బై బై గణేషా అంటూ వీడ్కోలు పలికారు. మహా గణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసే అపూర్వ ఘట్టాన్ని కోట్ల మంది టీవీలు, ఆన్ లైన్ ద్వారా వీక్షించారు. గణేష్ నవరాత్రుల్లో కోట్ల మంది భక్తులను దర్శనం ఇచ్చిన ఖైరతాబాద్ గణేషుడు.. ఈ ఏడాదికి బై బై చెప్పారు..
71 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఖైరతాబాద్గణేశుడు ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భక్తులను ఆకర్షించాడు.
అంతకు ముందు సెప్టెంబర్ 6న ఉదయం 7: 30గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర 4 గంటల పాటు జరిగింది. లక్షలాది మంది భక్తులు జై జై గణేషా.. బై బై గణేషా అంటూ గణనాథునికి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు. భక్తుల పరివారంతో నగర వీధుల్లో ఊరేగుతూ టెలిఫోన్ భవన్- ఇక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం మీదుగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నంబర్ 4 దగ్గరకు వరకు జరిగింది. మధ్యాహ్నం 2 గంటలలోపు పూర్తి చేశారు.
- అనుకున్న టైంకే నిమజ్జనం పూర్తి చేసిన అధికారులు
- గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణేశ్
- కాసేపట్లో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం
- టస్కర్ కు వెల్డింగ్ తొలగిస్తున్న అధికారులు
- గణపతికి హారతి ఇస్తున్న ఉత్సవ కమిటీ
- మహాగణపతి ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ 4 దగ్గరకు చేరుకుంది
- ఎన్టీఆర్ మార్గ్వైపు తరలివస్తున్న ఖైరతాబాద్ గణనాథుడు
- కిక్కిరిసిన ట్యాంక్ బండ్ పరిసరాలు
- సచివాలయం దాటిన మహాగణపతి
- తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గరకు(ఉదయం 10:40గంటలకు) చేరుకున్న ఖైరతాబాద్ గణేశ్
- ఉదయం 10: 15 మిషాలకు టెలిఫోన్ భవన్ సర్కిల్ వద్దకు చేరుకున్న గణపతి.
ఖైరతాబాద్ గణేశుడిని ఎక్కించిన టస్కర్ 26 టైర్లతో 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 200 టన్నుల బరువును అలవోకగా ఎత్తగల సామర్థ్యం దీని సొంతం. శుక్రవారం అర్ధరాత్రి టస్కర్పై విగ్రహాన్ని కూర్చోబెట్టే వెల్డింగ్ పనులు మొదలుపెట్టారు. తెల్లవారుజాములోపే ఈ పనులు కంప్లీట్ చేసి భారీ గణనాథుడిని టస్కర్పైకి ఎక్కించారు. తర్వాత మండపంలో ఎలాంటి బేస్గడ్డర్స్ఉన్నాయో..అదే సైజ్లో టష్కర్పై ఐరన్ గడ్డర్స్ తో వెల్డింగ్ చేశారు. టస్కర్పై కూర్చోబెట్టిన తర్వాత కదలకుండా వెల్డింగ్ చేశారు. వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్ స్తంభాలతో బలమైన బేస్ను ఏర్పాటు చేసి, విగ్రహాన్ని సురక్షితంగా హుస్సేన్ సాగర్ తీరంలోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు తరలించేందుకు సిద్ధం చేశారు. అబిడ్స్కు చెందిన పూల కళాకారులతో టస్కర్ను అందంగా అలంకరించారు. ఈ పనులతో పాటు షెడ్డు తొలగింపు పనులు కూడా కొనసాగుతున్నాయి.
ఏ రూట్లో వెళ్తుందంటే..
గణేశ్ మండపం నుంచి ఉదయం 6 గంటలకు గణనాథుని శోభాయాత్ర ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ నుంచి ఇక్బాల్ మినార్, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి, సెక్రటేరియేట్ మీదుగా సాగి..ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న నాలుగో నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం కానున్నది.
హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 20 క్రేన్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అందులో ఒకటి బాహుబలి క్రేన్. ఎన్టీఆర్ మార్గ్లో నాలుగో నంబర్ స్టాండులో అక్కడే ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేస్తారు.
