ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలి : ఖమ్మం అడిషనల్​ కలెక్టర్​ డాక్టర్​ శ్రీజ

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలి : ఖమ్మం అడిషనల్​ కలెక్టర్​ డాక్టర్​ శ్రీజ

కూసుమంచి, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించి ప్రజల నమ్మకాన్ని పెంచాలని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ డాక్టర్​ పి.శ్రీజ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం తిరుమలాయపాలెంలోని పీహెచ్​సీ, సీహెచ్​సీలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు, గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీసి పలుసూచనలు చేశారు.