
కూసుమంచి, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించి ప్రజల నమ్మకాన్ని పెంచాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం తిరుమలాయపాలెంలోని పీహెచ్సీ, సీహెచ్సీలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు, గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీసి పలుసూచనలు చేశారు.