ఖమ్మం ఎస్సై భార్య అనుమానాస్పద మృతి.. వేధింపులే కారణం..?

ఖమ్మం ఎస్సై భార్య అనుమానాస్పద మృతి.. వేధింపులే కారణం..?

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం జీఆర్పీ ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. గత నాలుగు రోజుల క్రితం జూలురుపాడులో పురుగుల మందు తాగిన రాజేశ్వరీ .. చికిత్స పొందుతూ హైదరాబాద్ లో మృతి చెందటం సంచలనంగా మారింది.

వేధింపుల కారణంగానే రాజేశ్వరి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్సై రాణా ప్రతాప్, అతని సోదరుడు ఎస్సై మహేశ్ , తల్లి తో సహా కుటుంబ సభ్యులు కలిసి దాడి చేయడంతోనే మృతి చెందినట్లుగా చెబుతున్నారు. 

మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్. ఐ రాణాప్రతాప్ తో రాజేశ్వరి కి 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మొదటి నుంచి రాణా ప్రతాప్ ది దురుసు ప్రవర్తన అని.. వివాదస్పదుడిగా అతనికి పేరుందని చెబుతున్నారు. ఖమ్మం లో ట్రైనీ ఎస్సైగా ఉన్న సమయంలో గన్ను చూపెట్టి బెదిరించి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇరువురు అన్నదమ్ముల బెదిరింపు వ్యవహారం ఎంతో వివాదాస్పదమైందని.. సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.