బాలీవుడ్ లో మరో లవ్ బర్డ్స్ పెళ్లి పీఠలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కియారి అద్వానీ షేర్షా సహ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 6న వివాహం చేసుకోనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రాజస్థాన్లోని జైసల్మేర్లో పెళ్లి జరగనుందని సమాచారం. ఇరువురు కుటుంబ సభ్యులు, అతిథుల మధ్య సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కరణ్ జోహార్ నిర్వహించే చాట్ షో కాఫీ విత్ కరణ్ లో ఇటీవలే కియారి, సిద్ధార్ధ్ లు పాల్గొన్నారు. సిద్ధార్థ్తో సంబంధంపై కరణ్ అడిగిన ప్రశ్నకు కియారా సరైన సమాధానం చెప్పలేదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినా వారు రూమర్స్ స్పందించలేదు. పెళ్లి గురించి సిద్ధార్థ్, కియారాలు జనవరిలో స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.