- మా వాళ్ల డెడ్బాడీలు అప్పగించండి
- హైదర్పొర ఎన్కౌంటర్మృతుల బంధువుల నిరసన
- వాళ్లు టెర్రరిస్టులు కాదని వెల్లడి
శ్రీనగర్: హైదర్పొర ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇద్దరు సివిలియన్లు అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్డెడ్బాడీలను అప్పగించాలని వాళ్ల బంధువులు డిమాండ్ చేశారు. వాళ్లిద్దరూ టెర్రరిస్టులు కాదని, టెర్రరిస్టులకు సాయంచేయలేదని చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ బుధవారం శ్రీనగర్లో ప్రెస్ ఎన్క్లేవ్ దగ్గర నిరసన తెలిపారు. భట్30 ఏండ్లుగా హైదర్పొరలో బిజినెస్ చేస్తున్నారని ఆయన సోదరుడు అబ్దుల్ మజీద్ చెప్పారు. భట్బిల్డింగ్లో కిరాయికి ఉంటున్న వాళ్ల వివరాలను పోలీసులకు ఇచ్చి వెరిఫై చేయించుకున్నామని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తమను కలవాల్సిందని అన్నారు. ‘నా బ్రదర్ బిల్డర్, ట్యాక్స్కడుతున్నారు. లోకల్లో ఎవరిని అడిగినా చెప్తారు. పోలీసులకూ ఆయన తెలుసు. రోజూ ఆయనుండే ప్లేస్కు వస్తారు. కలిసి టీ తాగుతారు’ అని చెప్పారు. ‘సోమవారం టాస్క్ఫోర్స్పోలీసులు వచ్చి భట్ను ఇంట్లోని పై పోర్షన్లోకి తీసుకెళ్లారు. మూడుసార్లు సెర్చ్చేశారు. డ్రోన్లు కూడా వాడారు. చివరికి అమాయకుడైన భట్ను చంపేశారు’ అని కన్నీరుమున్నీరయ్యారు. తన సోదరుడు ఏదైనా చట్ట వ్యతిరేక పనులు చేసినట్టు తేలితే తనను బహిరంగంగా ఉరి తీయాలన్నారు. తమకు న్యాయం కావాలని, డెడ్బాడీలను అప్పగించాలని అల్తాఫ్ ఫ్యామిలీ డిమాండ్ చేసింది.
టెర్రర్ కార్యకలాపాలు సాగుతున్నాయని..
ఎన్కౌంటర్లో ఓ పాకిస్తానీ టెర్రరిస్టు, అతనికి స్థానికంగా సాయం చేస్తున్న మహ్మద్ ఆమిర్, ఇద్దరు లోకల్ సివిలియన్స్ అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. అల్తాఫ్భట్ తన ఇంటిని గుల్కు అద్దెకిచ్చాడని, ఆ ఇంట్లో అక్రమంగా కాల్సెంటర్ నడుస్తోందని, టెర్రర్ కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిపారు. ఎన్కౌంటర్లో టెర్రరిస్టులతో పాటు చనిపోయిన ఇద్దరు వ్యక్తులు టెర్రరిస్టుల సానుభూతిపరులని పోలీసులు చెప్పడం, ఈ ఆరోపణలను బంధువులు కొట్టిపారేయడంతో వివాదం చెలరేగింది.