
ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం.. ఏప్రిల్ 7న ‘మీటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అతుల్య రవి హీరోయిన్. రమేష్ కాదూరి దర్శకత్వంలో చెర్రీ, హేమలత నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్ను దర్శకుడు బాబీ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ‘రమేష్ నా దగ్గర అసిస్టెంట్గా చేశాడు. అందుకే ఈ సినిమా బాధ్యత నాపై కూడా ఉంటుంది. కిరణ్కి ఈ మూవీ కొత్త మీటర్ సెట్ చేస్తుందని నమ్ముతున్నా. టీజర్ చూస్తుంటే పక్కా మాస్ మూవీ అని అర్ధమవుతుంది’ అని చెప్పాడు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘చిన్నప్పట్నుంచీ ఎలాంటి సినిమాలైతే చూసి విజిల్స్ వేశానో.. అలాంటి సినిమానే ‘మీటర్’. హై లెవల్ ఎనర్జీ ఉండే సబ్జెక్ట్ ఇది. థియేటర్స్లో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారి సినిమాలు ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి తరహాలో ఉంటుంది’ అని అన్నాడు. ‘మా సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు దర్శకుడు రమేష్. చెర్రీ మాట్లాడుతూ ‘పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఇది. చాలా డైనమిక్గా ఉండబోతుంది. కిరణ్లోని మాస్ అవతార్ను చూస్తారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మాకు అండగా నిలిచింది’ అన్నారు. సప్తగిరి, సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.