దేశ అభివృద్ది, ధర్మం కోసం మోదీ కృషి: కిషన్ రెడ్డి

దేశ అభివృద్ది, ధర్మం కోసం  మోదీ కృషి: కిషన్ రెడ్డి

దేశ అభివృద్ది కోసం, ధర్మం కోసం  మోదీ ఎంతో కృషి చేశారన్నారు కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మరోసారి మోదీని దేశ ప్రధానిని చేయాలన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని దేవీనగర్, బ్రూక్ బాండ్ కాలనీ, న్యూ బోయిగూడ ప్రాంతంలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో  BJP కి  మద్దతివ్వాలని కోరారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుస్తుందని చెప్పారు.  ఇప్పటికే రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామన్నారు. మరో ఇద్దరు అభ్యర్థులను వీలైనంత త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఇక, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరని.. ఆ పార్టీ తరుఫున పోటీ చేయాలంటేనే భయపడే పరిస్థిత ఉందన్నారు. మూడోసారి కూడా మోదీనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈసారి ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.