లష్కర్ లో ఎగిరేది కాషాయ జెండానే : కిషన్ రెడ్డి

లష్కర్ లో ఎగిరేది కాషాయ జెండానే : కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ లో కాషాయ జెండా ఎగురుతుందన్నారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ కు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కిషన్ రెడ్డి. నామినేషన్ వేసే ముందు బషీర్ బాగ్ లోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ ప్రజలు చైతన్యవంతులని.. తనను తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.