MMTSను యాదాద్రి వరకు పొడిగించేందుకు కేంద్రం రెడీ

 MMTSను యాదాద్రి వరకు పొడిగించేందుకు కేంద్రం రెడీ

జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ లో అవినీతిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ బర్కత్ పురా సిటీ బీజేపీ ఆఫీసులో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. TRS ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. GHMC ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా.. నిధులు లేక గెలిచిన కార్పొరేటర్లు అవస్థలు పడుతున్నారన్నారు. GHMCలో నిధులు లేక హైదరాబాద్ నగరం అభివృద్ధి కుంటుపడిందన్నారు. MMTSను యాదాద్రి వరకు పొడిగించేందుకు కేంద్రం రెడీగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదన్నారు కిషన్ రెడ్డి.