మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి

మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి

లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ..మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహంకాళీ అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఉదయం ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డి దంపతులకు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు.