సికింద్రాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో కుటుంబ పార్టీలను ఓడించి, దేశాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీని గెలిపించాలని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి కోరారు. బుధవారం ఆయన తార్నాక, మెట్టుగూడలో ప్రచారం, బైక్ర్యాలీ నిర్వహించారు. స్థానికులను కలిసి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. లాలాపేట వివేకానంద చౌక్, మెట్టుగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్నర్మీటింగ్స్లో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలనని, వాటివల్ల దేశంలో జరిగే అభివృద్ధి శూన్యమన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీని మరోసారి ఆదరించాలని కోరారు. కరోనా టైంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలు, చర్యలను వివరించారు.
మహిళలు స్వయం ఉపాధి పొందేలా రూ.20 లక్షల రుణాలు అందజేశామని, ట్రిపుల్ తలాక్ ను రద్దుచేసి ముస్లిం మహిళల సంక్షేమానికి పాటుపడ్డామని చెప్పారు. రూ.727 కోట్ల నిధులతో సికింద్రాబాద్రైల్వేస్టేషన్ను ఎయిర్పోర్టుకు ధీటుగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. డెవలప్చేసిన చర్లపల్లి రైల్వేస్టేషన్ను రెండు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన వెంట మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి, బీజేపీ నాయకులు శ్యాంసుందర్గౌడ్, మేకల సారంగపాణి, శారద, మల్లేశ్, చంద్రారెడ్డి, వీరన్న, చంద్రశేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు.