దుబాయ్: ఆస్ట్రేలియాతో సిరీస్లో మంచి పెర్ఫామెన్స్ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్ తమ టీ20 ర్యాంక్స్ను ఇంప్రూవ్ చేసుకున్నారు. బుధవారం రిలీజైన టీ20 బ్యాట్స్మెన్ లేటెస్ట్ ర్యాంకింగ్స్లో లోకేశ్ టాప్–3లోకి దూసుకొచ్చాడు. కోహ్లీ ఒక ప్లేస్ మెరుగై ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్తో ఫస్ట్ టీ20లో ఫిఫ్టీ కొట్టిన రాహుల్.. కంగారూ టీమ్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ను నాలుగో ప్లేస్కు నెట్టి మూడో ర్యాంక్ సాధించాడు. అతని ఖాతాలో 816 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.
ఇంగ్లండ్ బ్యాట్స్మన్ డేవిడ్ మలాన్ (915) టాప్ ప్లేస్ను నిలబెట్టుకోగా.. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ రెండో ర్యాంక్లో నిలిచాడు. చివరి టీ20లో 85 రన్స్తో చెలరేగిన విరాట్ తొమ్మిది నుంచి 8వ ప్లేస్కు చేరాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో ఆసీస్ స్పిన్నర్ జంపా రెండు ప్లేస్లు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. అఫ్గానిస్తాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, ముజీబుర్ రహ్మన్ తొలి రెండు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ల లిస్ట్లో అఫ్టాన్ ప్లేయర్ మొహమ్మద్ నబీ టాప్ ప్లేస్లో ఉన్నాడు.