July 1st Rules: జూలై 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే.. ఆ బ్యాంక్స్ కస్టమర్లకు కీలక అలర్ట్..

July 1st Rules: జూలై 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే.. ఆ బ్యాంక్స్ కస్టమర్లకు కీలక అలర్ట్..

Rules Changing From July: ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా కొన్ని కీలకమైన మార్పులు ఆర్థికపరమైన అంశాల్లో రాబోతున్నాయి. అవి వినియోగదారుల జేబులపై నేరుగా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. ముందుగా పాన్ కార్డు వినియోగదారులకు కీలకమైన అప్ డేట్ ఉంది. ఇకపై కొత్తగా పాన్ కార్డు పొందాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డుతో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాన్ కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ చేయటం కూడా తప్పనిసరి చేయబడింది. ఇదే క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15కు పొడింగించిందని గమనించాలి. 

క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ రూల్స్ కీలక మార్పులు చేసింది. ఇకపై ఎస్బీఐ కార్డ్ ఉపయోగించి వినియోగదారులు ఫ్లైట్ టిక్కెట్స్ కొనుగోలు చేస్తే వాటిపై విమాన ప్రమాద ఇన్సూరెన్స్ కవరేజీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. జూలై 15 నుంచి వీటిని SBI Card ELITE, Miles ELITE, Miles PRIME కార్డు దారులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ కవర్ లభించదని పేర్కొంది. అలాగే ఎస్బీఐ ప్రైమ్, పల్స్ కార్డులకు అందిస్తున్న 50 లక్షల కవరేజ్ కూడా తొలగిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఇదే క్రమంలో బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ పేమెంట్ లెక్కించే ఫార్ములాలో కూడా కీలక మార్పులు చేసింది. ఇది వ్యక్తులపై అదనపు భారాన్ని మోపనుంది. 

►ALSO READ | Trade War: టారిఫ్స్ పొడిగించే ఆలోచనలేదన్న ట్రంప్.. కొనసాగుతున్న భారత చర్చలు..

ఇదే సమయంలో మరో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డులపై ఛార్జీలను జూలై 1 నుంచి మార్పులకు శ్రీకారం చుట్టింది. అద్దె చెల్లింపులపై 1 శాతం, ఆన్ లైన్ గేమ్స్ చెల్లింపులకు 1 శాతం, యుటిలిటీలకు 1 శాతం, వాలెట్లోకి డబ్బులు లోడింగ్ కోసం 1 శాతం చార్జీలను ఫిక్స్ చేస్తూ నెలవారీ వాటికి గరిష్ఠ పరిమితులను అందించింది. 

ఐసీఐసీఐ బ్యాంక్ తన సర్వీస్ ఛార్జీల్లో కీలక మార్పులను జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. దీని ప్రకారం వినియోగదారులు ఏటీఎంలలో చేసే మెుదటి 5 ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నెలకు ఉచితమని వెల్లడించింది. పరిమితి తర్వాత చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కి రూ.23 చొప్పున సర్వీస్ చార్జ్ వసూలు చేయబడుతుందని వెల్లడించింది. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు మాత్రం ఉచితంగానే ఉంటాయని పేర్కొంది. అలాగే బ్యాంక్ తన క్యాష్ డిపాజిట్ చార్జీలు, బ్రాంచ్ క్యాష్ విత్ డ్రా చార్జీలు, ఐఎంపీఎస్ పేమెంట్ ఛార్జీలు వంటి వాటిని సవరించింది.