కృష్ణా నది జలాల్లో తెలంగాణా వాటాపై కోదండరాం దీక్ష

కృష్ణా నది జలాల్లో తెలంగాణా వాటాపై  కోదండరాం దీక్ష

కృష్ణా నదీ జలాల వాటా సాధనకై టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ ప్రొ. కోదండరాం జలదీక్ష చేపట్టారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణా వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కోదండరాం వాదించారు. కృష్ణా నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతామని హెచ్చరించారు.

కృష్ణా పరీవాహిక ప్రాంతంలో టీజేఎస్ యాత్ర నిర్వహించి  వివిధ నిరసన కార్యక్రమాలు చేశామని కోదండరాం చెప్పారు. ఉద్యమాన్ని తీవ్రం చేయుటలో భాగంగా ఈ దీక్ష చేస్తున్నామన్న ఆయన.. కోదండరాం నాయకత్వంలో టీజేఎస్ బృందం ఈ నెల 30, 31వ తేదీల్లో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, కృష్ణా, గోదావరి బోర్డు అధికారులను కలుస్తామని స్పష్టం చేశారు.