ఎమ్మెల్సీ బరిలో కోదండరాం

ఎమ్మెల్సీ బరిలో కోదండరాం

హైదరాబాద్, వెలుగు: త్వరలో ఖాళీ కానున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు నుంచి ప్రొఫెసర్ కోదండరాంను బరిలో నిలపాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయించింది. టీజేఏసీ చైర్మన్ గా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఒకే తాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంకు గ్రాడ్యుయేట్లలో మంచి ఆదరణ ఉందని, ఆయన బరిలోకి దిగితే గెలుపు సులువేనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీల మద్దతు కూడగట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ క్యాండిడేట్ను నిలపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దుబ్బాక అసెంబ్లీ సీటుకు జరగబోయే ఉప ఎన్నికలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.

శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై ఎన్నో డౌట్స్