చెక్ బౌన్స్​ కేసులు రాజీ చేసుకోండి : జూనియర్​ సివిల్ ​జడ్జి శ్రీరామ్

చెక్ బౌన్స్​ కేసులు రాజీ చేసుకోండి : జూనియర్​ సివిల్ ​జడ్జి శ్రీరామ్
  • జూన్​9 నుంచి 14 వరకు స్పెషల్ లోక్ అదాలత్

కొడంగల్, వెలుగు: పెండింగ్​లో ఉన్న చెక్​బౌన్స్​కేసులను రాజీ చేసుకోవాలని, దీనివల్ల సమయం, డబ్బు రెండూ వృథా కావని కొడంగల్​మున్సిఫ్​ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ సూచించారు. మంగళవారం కొడంగల్​ కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు సీజే, స్టేట్​ లీగల్ సెల్ అథారిటీ ఆదేశాల మేరకు రూ.5 లక్షల వరకు ఉన్న చెక్ బౌన్స్​కేసులను జూన్​9 నుంచి14 వరకు నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్​లో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. 

ఇదివరకు ఇటువంటి కేసుల రాజీకి ముందుగా నగదు కోర్టులో డిపాజిట్​చేయాల్సి ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు పూర్తిగా మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే, బ్యాంక్ ల పరిధిలోని కేసులనూ రాజీ చేసుకోవచ్చని చెప్పారు. జూన్​14న నిర్వహించే జాతీయ మేగా లోక్​ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.