ఏసీబీకి చిక్కిన కొల్లూర్ ఎస్సై

ఏసీబీకి చిక్కిన కొల్లూర్ ఎస్సై
  • రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టివేత

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా సైబరాబాద్​ కమీషనరేట్  పరిధిలోని కొల్లూర్​ స్టేషన్​ ఎస్సై రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్​లో నమోదైన ఎసెన్షియల్​ కమొడిటీస్​ కేసులో ఫిర్యాదుదారుడి పేరు తొలగించేందుకు కొల్లూర్​ ఎస్సై రమేశ్  రూ.30 వేలు లంచం డిమాండ్  చేసి, గత నెల 17న రూ.5 వేలు అడ్వాన్స్​గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బుల కోసం ఎస్సై ఇబ్బంది పెట్టడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం ఎస్సైకి రూ.20 వేలు అందజేయగా, రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఎస్సైని ఏసీబీ స్పెషల్​ కోర్టులో హాజరుపరిచారు.