రాహుల్ చెప్పిందే చెప్పిన.. నేనేం తప్పుగా మాట్లాడలే : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

రాహుల్ చెప్పిందే చెప్పిన.. నేనేం తప్పుగా మాట్లాడలే : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుకు సంబంధించిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. బీఆర్ఎస్ తో పొత్తుండదని వరంగల్ సభలో రాహుల్ గాంధీ చెప్పిన మాటల్ని మాత్రమే తాను రిపీట్ చేశానని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం తాను ఏ కమిటీలో లేనన్న ఆయన.. కాంగ్రెస్ కు చెందిన చిన్న చిన్న నాయకులు కూడా తనను తిట్టడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హంగ్ ఏర్పడుతుందన్న కామెంట్లపైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో సర్వేల వివరాల ఆధారంగా తాను ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. తాను కన్ఫ్యూజన్ లో ఉన్నానని బీజేపీ వాళ్లు అంటున్నారని, అయితే వారే అయోమయంలో ఉన్నారన్న విషయం వాళ్లకు తెలుస్తలేదని చెప్పారు. తానేం తప్పు మాట్లాడలేదని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 

అంతకు ముందు ఢిల్లీ నుంచి వచ్చిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో శంషాబాద్ ఎయిర్పోర్టులోనే సమావేశమయ్యారు. వారిద్దరూ దాదాపు 20 నిమిషాల భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలు నదీమ్ జావిద్, బోసు రాజు, వేణుగోపాల్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.