టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డిపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన షాక్ తో గుత్తా కు మతిభ్రమించదన్నారు. మంత్రి పదవి ఇస్తానని, ఎంపీ గా, ఎమ్ఎల్సీ గా గెలిపిస్తానన్న కేసీఆర్ మాయమాటలతో .. గుత్తా షాక్ తిన్నారని అన్నారు.
3 పార్టీలు మారిన ఏకైక ఎంపీ గుత్తా ఒక్కడే
ఆ షాక్ తోనే బెడ్రూమ్ లో కేసీఆర్ ని…, బయట తమ పార్టీ వారిని తిడుతున్నారని విమర్శించారు కోమటిరెడ్డి. తాను దయతలిచి రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి ఎంపీగా గెలిపిస్తే ఇప్పటి వరకూ 3 పార్టీలు మారారని అన్నారు. దేశంలో మూడు పార్టీలు మారిన ఏకైక ఎంపీవి నువ్వొక్కడివే గుత్తాను ఎద్దేవా చేశారు.
సమాచార హక్కు కింద లెటర్లు పెట్టి సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులను బెదిరించి గుత్తా వేల కోట్ల రూపాయలు సంపాందిచాడని, వేల ఎకరాలు కొన్నాడని ఆరోపించారు కోమటిరెడ్డి. తన తమ్ముడిని డెయిరీ చైర్మన్ గా చేసి 30 ఏండ్లుగా దోచుకుతింటున్న నీచమైన చరిత్ర గుత్తా సుఖేందర్ రెడ్డిది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.