తుది శ్వాస ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తుది శ్వాస ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తన తుది శ్వాస ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీజేపీని వదిలిపెట్టి ఇతర పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కొంతమంది కావాలని తనపై దుష్ప్ర ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను రెండు రోజుల క్రితం పార్టీ మారడం లేదని ప్రెస్ నోట్ కూడా విడుదల చేశానని తెలిపారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. 

ఎల్బీనగర్ నుంచి పోటీ చేయమని అక్కడ ప్రజలు కోరుతున్నారని, మరోవైపు.. మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఘట్​ కేసర్​ లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.