చిలుకూరు ఆలయం వరకు కొండా రాఘవ రెడ్డి పాదయాత్ర

చిలుకూరు ఆలయం వరకు  కొండా రాఘవ రెడ్డి పాదయాత్ర

హైదరాబాద్ : వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతమవ్వాలని కోరుతూ లోటప్ పాండ్ పార్టీ ఆఫిస్ నుంచి చిలుకూరు బాలాజీ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి. ఈ నెల 20 న ప్రారంభమైయ్యే వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే వైఎస్ షర్మిల  ఈ పాదయాత్ర మొదలుపెట్టారని చెప్పారు. వర్షాలతో హైద్రాబాద్ అతలాకుతలమైన కేసీఆర్ అడుగుబయటపెట్టలేదని విమర్శించారు.