పునరావాస కాలనీ మళ్లీ మునిగింది..!

పునరావాస కాలనీ మళ్లీ మునిగింది..!

గజ్వేల్, వెలుగు: కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం ములుగు మండలం ఆర్అండ్ఆర్ కాలనీలో ఏర్పాటుచేసిన పునరావాస కాలనీ మరోసారి మునిగింది. తమకు మెరుగైన పరిహారం ఇవ్వాలంటూ కొందరు కోర్టుకెళ్లగా వారికి ఇదే కాలనీలో చివరన లోతట్టు ప్రాంతంలో తాత్కాలిక వసతి కల్పించారు. ఈ సీజన్లో జూన్ 10న ఒకసారి ఈ ఏరియా నీట మునగగా, ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మరోసారి జలమయమైంది. ఇండ్లలోకి నీరు చేరడంతో రాత్రివేళ ఎటు వెళ్లాలో తెలియక నిర్వాసితులు తిప్పలు పడ్డారు. ఇండ్లలోని సామగ్రి, నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. తాము కోర్టుకు వెళ్లినందుకే ఇలా కక్ష తీర్చుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం ఆఫీసర్లు కాలనీకి చేరుకుని నీటిని బయటికి పంపించే పనుల్లో నిమగ్నమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి