నామమాత్రంగా కొండాపూర్ జనరల్​ బాడీ మీటింగ్

నామమాత్రంగా కొండాపూర్ జనరల్​ బాడీ మీటింగ్

కొండాపూర్, వెలుగు: మండల స్థాయి జనరల్ బాడీ మీటింగ్ సోమవారం ఎంపీపీ మనోజ్ రెడ్డి అధ్యక్షతన నామమాత్రంగా జరిగింది. సభకు ఎంపీవో శ్రీనివాస్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. సమావేశానికి 27 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం13 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు 14 శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.

ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ.. రెండేండ్ల నుంచి స్టేట్ ఫైనాన్స్ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సమావేశంలో ఎంపీటీసీలు విజయభాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, కాంతయ్య సర్పంచులు రుక్మోద్దీన్, వెంకటేశం గౌడ్, ఫయీం, నర్సింలు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాణిక్ రెడ్డి పాల్గొన్నారు.