హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగానికి సుస్థిర పరిష్కారాలు అందించే కొప్పెర్ట్ సంస్థ హైదరాబాద్ బొల్లారంలో మైకోరైజా ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఇది అగ్రిలైఫ్ ఇండియా, నెదర్లాండ్స్కు చెందిన కొప్పెర్ట్ బీవీ ఉమ్మడి సంస్థ. భూమిలో సహజ సిద్ధమైన శిలీంధ్రాలను పెంచడం ద్వారా పంటలకు పోషకాలు అందేలా ఈ కేంద్రం సహకరిస్తుంది. దీనివల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గి మట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా రైతులకు ఈ మైకోరైజా ద్రావణాలు ఉపయోగపడతాయని కొప్పెర్ట్ తెలిపింది. పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కేంద్రాన్ని విస్తరించినట్లు పేర్కొంది.
