మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరు నెలల్లో జైలుకెళ్లడం ఖాయం: కొత్త మనోహర్ రెడ్డి

మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరు నెలల్లో  జైలుకెళ్లడం ఖాయం: కొత్త మనోహర్ రెడ్డి

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మహేశ్వరం నియోజకవర్గ నేత కొత్త మనోహర్ రెడ్డి. సీబీఐ కేసుల్లో సబితా ఇంద్రారెడ్డి మరో ఆరు నెలల్లో జైలుకెళ్లడం ఖాయమన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు. మంత్రి  అవినీతి చూడలేక జూలై 2న ఖమ్మంలో జరిగే జనగర్జన సభలో  రాహుల్ సమక్షంలో  కాంగ్రెస్ లో చేరుతున్నానని చెప్పారు మనోహర్ రెడ్డి. 

నియోజకవర్గంలో  ప్రభుత్వ స్థలాలు, అసైన్ మెంట్ భూములను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.  మంత్రి సబిత అండదండలతో  కొర్పొరేటర్స్, పార్టీ అధ్యక్షులు దోచుకుంటున్నారని విమర్శించారు. చెరువులు అభివృద్ధి పేరుతో మంత్రి ఆమె అనుచరులకు కోట్లు దోచి పెడుతున్నారని ఆరోపించారు.   మీర్ పేటలో  కొర్పొరేషన్ లో కొంతమంత్రి పెంపుడు కుక్కలను  మంత్రి పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.  మంత్రి తన పెంపుడు కుక్కలతో తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు.