- వీసీ వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తుండు
- బహుజన విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీ నేతలు
ఓయూ,వెలుగు: వందేండ్ల చరిత్ర కలిగిన ఓయూ ప్రతిష్టను వీసీ రవీందర్ యాదవ్ దిగజార్చుతున్నాడని బహుజన విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీ నేతలు వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి ఆరోపించారు. మంగళవారం ఓయూలో మీడియాతో మాట్లాడుతూ.. వర్సిటీ చరిత్రను తెలిపే విధంగా నిర్మాణం ఉండాలని, అందుకు భిన్నంగా 100 పైపర్స్ మద్యం సీసా బాటిల్ రూపంలో లోగోను ఏర్పాటు చేశారని ఆరోపించారు.
పైలాన్ లో మద్యం సీసాను పోలిన లోగోను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్, బీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు, భాస్కర్ కుమార్, సతీశ్, ఆనంద్, తనిష్క, సోని ఉన్నారు.