
బషీర్బాగ్, వెలుగు: కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్లు అధునాతన శస్త్రచికిత్స చేశారు. ఓ వ్యక్తి కంట్లో నుంచి ముక్కులోకి దిగిన కత్తిని తొలగించి అతని ప్రాణాలు కాపాడారు. వికారాబాద్ జిల్లా రాపోలే గ్రామానికి చెందిన రాజేందర్పై ఈ నెల10న కుటుంబ కలహాలతో గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బాధితుడిని కుటుంబసభ్యులు సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు, అక్కడ్నుంచి సరోజినీ దేవికి తరలించారు.
పరీక్షించిన డాక్టర్లు కత్తి కంట్లో నుంచి ముక్కులోకి దిగిందని గుర్తించి, ఈ నెల18న కోఠి ఈఎన్టీ హాస్పిటల్కు రిఫర్ చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ ఆచార్య ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసి, కత్తిని తొలగించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని, సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించినట్లు డాక్టర్ ఆచార్య తెలిపారు. ఆపరేషన్లో డాక్టర్లు మోదిని, రవి, ఉమా, ప్రదీప్, నర్సింగ్ ఆఫీసర్ అంజలి పాల్గొన్నారు.