జనవరి 21 నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో కోటి ప్రత్యంగీర మహా యాగం

జనవరి 21 నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో కోటి ప్రత్యంగీర మహా యాగం

ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు దేశంలోనే తొలిసారిగా కోటి ప్రత్యంగీర మహా యాగాన్ని నిర్వహించనున్నట్లు సిద్ధేశ్వర పీఠం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శశిభూషణ్ తెలిపారు. ఈ యాగానికి సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.

21 నుంచి 28వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు యాగం ఉంటుందన్నారు. రాత్రి 7:30 గంటలకు వివిధ దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం, సిద్ధేశ్వర నంద భారతి అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు.కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు ప్రతిరోజు వివిధ దేవతల రూపు కాసు రుద్రాక్ష మొదలైన వస్తువులతో పాటు ఉచిత ప్రసాదం అందజేస్తామని వెల్లడించారు.