
తెలంగాణలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్య యాంటీ నార్కొటిక్ వింగ్ డైరెక్టర్గా బదిలీ చేసింది.
రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్బాబును, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమించింది. రాచకొండ సీపీ చౌహాన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రలను డీజీ ఆఫీస్కు అటాచ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు సైబరాబాద్, రాచకొండ సీపీలుగా వ్యవహరించిన స్టీఫెన్ రవీంద్ర, దేవేంద్రసింగ్ చౌహాన్లను డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.