టాలీవుడ్లో డ్రగ్స్ కేసు పెను దుమారమే రేపుతోంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో భాగంగా వాట్సప్డేటాను జూన్ 28న సైబరాబాద్పోలీసులు రికవర్ చేశారు. డ్రగ్స్ కొనుగోళ్లతో సంబంధం ఉన్న సినీ ప్రముఖుల వివరాలను ఆరా తీశారు. డేటాను అనాలసిస్ చేస్తూ.. ఇప్పటివరకు ఉన్న సాక్ష్యాల ఆధారంగా ఒకటి రెండు రోజుల్లో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే 14 మందికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే నటి సురేఖ వాణి తదితరుల పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఆయా నటులు ఖండిస్తున్నారు. కేపీ చౌదరితో ఫ్రెండ్షిప్ ఏ తప్పా.. మరెలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు. 300 మంది వరకు పొలిటీషన్స్, బిజినెస్ మ్యాన్స్, సినీ ప్రముఖులు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్న ఈ కేసు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.