కేపీసీసీ డీకే శివకుమార్ భావోద్వేగం

కేపీసీసీ డీకే శివకుమార్ భావోద్వేగం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా విజయానికి తాను పడిన కష్టాన్ని గుర్తు తెచ్చుకున్నారు. తాను తీహార్ జైల్లో ఉన్నప్పుడు.. సోనియా గాంధీ తనను కలవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్న ఆయన.. ఆ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.

2020లో శివకుమార్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. ఆ సందర్భంగా సోనియా గాంధీ ఆయన్ని జైలులో  పరామర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనక కీలక పాత్ర పోషించిన  డీకే అప్పటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు.  తన గెలుపునకు సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోవడానికి రామనగర వచ్చిన సందర్భంగా డీకే ఈ వ్యాఖ్యలు చేశారు.