
- ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో లక్ష మంది విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంతో కార్యచరణ చేపట్టామని ఇంటర్ విద్యా శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. హైస్కూల్ హెడ్మాస్టర్లు, పేరెంట్స్ ను కలిసి అడ్మిషన్ల పెంపునకు లెక్చరర్లు కృషి చేయాలన్నారు.
మంగళవారం సర్కారు జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ తో ఇంటర్ విద్యా ఆర్జేడీ జయప్రదబాయితో కలిసి జూమ్ లో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకూ 430 కాలేజీల్లో 35 వేల అడ్మిషన్లు జరిగాయని తెలిపారు. సర్కారు కాలేజీల్లో అవసరాలుంటే తక్షణం ప్రతిపాదనలు పంపించాలన్నారు.