పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,హీరోయిన్ కృతిసనన్ డేటింగ్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతకొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ ఈ రూమర్స్ ను మరో స్ధాయికి తీసుకెళ్లాయి. అయితే ఈ వార్తలకు కృతిసనన్ చెక్ పెట్టింది. ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. వరుణ్ ధావన్ అటపట్టించడానికి అలా అన్నాడని తెలిపింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీని ఫోస్ట్ చేసింది.
మరోవైపు ఈ వరుణ్ ధావన్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సినిమా ప్రమోషన్ కోసం మా అన్న పేరుని ఇంతలా వాడుతున్నారేంటి?’ అంటూ మండిపడుతున్నారు. ప్రభాస్-, కృతిసనన్ కలిసి ఆదిపురుష్ మూవీలో కలిసి నటిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమా పై భారీ అంచనాలున్నాయి.