పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రంలో నటిస్తున్నాడు. ఓంరౌత్ (Om Raut) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సీతగా కృతి సనన్ (Kriti Sanon) కనిపించబోతోంది. ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నాడు. ఈ రిలీజ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ జాబితాలో హీరోయిన్ కృతి సనన్ కూడా ఉంది. అయితే ఈ సినిమా టీజర్ విడుదలైన నాటి నుంచి ప్రభాస్, కృతి ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా గతేడాది తాను నటించిన ‘బేడియా’ ప్రమోషన్స్లో భాగంగా హీరో వరుణ్ ధావన్తో కలిసి కృతి ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కృతి రిలేషన్షిప్ స్టేటస్ గురించి వరుణ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు..‘‘కృతి పేరును ఓ వ్యక్తి తన గుండెల్లో పెట్టుకున్నారు. ప్రస్తుతం తను ముంబయిలో లేడు. దీపికా పదుకొణెతో కలిసి షూట్లో ఉన్నాడు’’ అంటూ ప్రభాస్ గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కృతిసనన్ స్పందించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. ‘‘వరుణ్ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ప్రభాస్తో ఫోన్లో మాట్లాడినప్పుడు దీనిపై ఆయనతో చెప్పాను. ఆయన వెంటనే.. ‘వరుణ్ ఎందుకు అలా చెప్పాడు?’ అని ప్రశ్నించాడు. ‘ఏమో నాక్కూడా తెలియదు. వరుణ్ పిచ్చితనంతో అలా చెప్పాడు’ అని బదులిచ్చాను’’ అని కృతి చెప్పుకొచ్చింది.