హైదరాబాద్, వెలుగు: యాసంగి కి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నీటి విడుదల ఇతర అంశాలపై చర్చించేందు కు ఈనెల 5న కేఆర్ఎంబీ త్రీ మెన్ కమిటీ మీటింగ్ పెడుతున్నరు. మంగళవారం రెం డు రాష్ట్రాలకు ఈ మేరకు సమాచారమిచ్చారు . జనవరిలోనే మీటింగ్ పెట్టాల్సి ఉన్నా మెంబర్ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారు. మార్చి నెలా ఖరు వరకు రెండు రాష్ట్రాలు ఆయా ప్రాజెక్టుల కింద అవసరమైన నీటి వివరాలు ఇప్పటి కే బోర్డుకు ఇచ్చాయి. డిసెంబర్ నెలా ఖరు వరకు రెం డు రాష్ట్రాలు ఉపయోగించుకున్న నీటి లెక్కలు, ప్రాజెక్టులు సర్ప్లస్ అయ్యే రోజుల్లో రెం డు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిపైనా చర్చించనున్నారు .
వైజాగ్కు కేఆర్ఎంబీ ఈఈలు
కేఆర్ఎంబీ హెడ్ క్వా ర్టర్స్ ను వైజాగ్కు షిఫ్ట్ చేయాలని ఏపీ కోరిన నేపథ్యం లో మంగళవారం బోర్డు ఎగ్జిక్యూటి వ్ ఇంజనీర్లు విశాఖపట్నం వెళ్లారు . ఈఈలు అశోక్కుమార్, శివ శంకరయ్య, శ్రీనివాసులు రెడ్డి, రఘునాథరావు విశాఖపట్నం లో పర్యటించి .. బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీకి రిపోర్ట్ ఇస్తారు.
For More News..
పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్