
- కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీ జరుగుతున్నదని..దీనిపై రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. "జాతీయ స్థాయిలో ఓట్ చోరీ గురించి నీతులు చెబుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చోరీ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఎమ్మెల్యేల చోరీ అనేది ఓటు చోరీ కంటే దారుణమైన నేరం" అని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.