వెస్ట్ పాం బీచ్: శాంటా క్లాజ్ ముసుగులో అమెరికాలోకి చొరబాటుదారులు ప్రవేశించే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వారిని దేశంలోకి చొరబడనివ్వకుండా చూడాలని పిల్లలకు సూచించారు. గురువారం ఫ్లోరిడాలోని ఎస్టేట్లో ఆయన క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సంప్రదాయ డయలింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన పలువురు చిన్నారులతో ఫోన్లో మాట్లాడారు. ‘‘శాంటా మంచివాడిగా ఉండేలా చూసుకోవాలి. దొంగ శాంటాలు దేశంలోకి చొరబడకుండా జాగ్రత్తగా ఉండాలి” అని ట్రంప్ సూచించారు. అయితే, గతంలో మాదిరిగా ఈసారి క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రత్యర్థులపై విమర్శలకు ట్రంప్ దూరంగా ఉన్నారు.
