- పానీపూరీ అమ్మే వ్యక్తికూతురుకు అరుదైన గౌరవం
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో పానీపూరీ అమ్మే వ్యక్తి కుమార్తెకు అరుదైన గౌరవం లభించింది. ఈనెల19 నుంచి 21 వరకు జైపూర్ పట్టణంలో జరిగిన ఫరెవర్ మిస్ టీన్ ఇండియా పోటీల్లో భద్రాచలానికి చెందిన ప్రీతీ యాదవ్ గ్రాండ్ ఫినాలేలో మిస్ టీన్ తెలంగాణ విజేతగా నిలిచింది. ఈమె తండ్రి ప్రకాశ్ భద్రాచలంలో పానీపూరీ అమ్ముతారు. దేశం నలుమూలల నుంచి 10వేల కంటే ఎక్కువ దరఖాస్తులు రాగా, అనేక పరీక్షల తర్వాత తెలంగాణ స్టేట్ నుంచి 101 మంది ఎంపికయ్యారు. వారిలో ప్రీతీయాదవ్ కూడా ఉన్నారు.
తిరిగి వీరి మధ్య జరిగిన పోటీల్లో చివరకు గ్రాండ్ పినాలే విజేతగా నిలిచారు. ఫరెవర్ మిస్ టీన్ తెలంగాణ -2025 కిరీటాన్ని ఆమె పొందారు. భద్రాచలంలోని అశోక్నగర్ కొత్తకాలనీలో నివాసం ఉంటున్న ప్రకాశ్ 20 ఏండ్ల కిందనే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. ప్రీతీయాదవ్ భద్రాచలంలోని ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.
