- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఫోరెన్సిక్ లాబ్ లో అగ్నిప్రమాదంపై అనుమానాలున్నాయని, వెంటనే విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ను బీఆర్ఎస్ కాపాడిందని, ఇప్పుడు కేసీఆర్ అరెస్టు కాకుండా రేవంత్కాపాడుతున్నారన్నారు. పదేండ్లలో తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందన్నారు. సింగరేణి టెండర్ల గోల్మాల్పై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. అంతా పారదర్శకంగా జరిగితే నైనీ కోల్ బ్లాక్లో టెండర్ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలతో సింగరేణి దివాలా తీసిందని, జీతాల కోసం అప్పులు చేసే దుస్థితికి వెళ్లిందని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి సింగరేణిపై సమీక్ష నిర్వహించారన్నారు. సింగరేణికి రూ.2,500 కోట్లు కేంద్రం ఇచ్చిందని, ఇప్పటికే రూ.1,400 కోట్లు రిలీజ్ అయ్యాయన్నారు. అబద్దాలతో బీజేపీని రేవంత్రెడ్డి బద్నాం చేస్తున్నారన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కొత్తగూడెంను అమృత్సిటీగా మారుస్తామన్నారు.
