ఓల్డ్సిటీ/వికారాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ గురువారం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. చాంద్రాయణగుట్టలోని లక్ష్మి చెన్నకేశవస్వామి, భూలక్ష్మమ్మ దేవాలయం, శ్వేతగంగ, జగన్నాథ స్వామి ఆలయాల్లో పూజలు చేశారు.18 మంది బంధువులతో కలిసి ఆమె ఈ ఆధ్యాత్మిక పర్యటనకు వచ్చారు. అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
